జూన్ 10 వ‌ర‌కు అన్ని విద్యాసంస్థ‌లు బంద్‌

|

Apr 12, 2020 | 7:07 AM

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ కాలం ఈ నెల 14తో ముగుస్తుండ‌గా, కొన్ని రాష్ట్రాల్లో ఈ గ‌డువును పెంచాల‌ని కోరుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఏప్రిల్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. ఇక తాజాగా మ‌రో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం […]

జూన్ 10 వ‌ర‌కు అన్ని విద్యాసంస్థ‌లు బంద్‌
Follow us on
కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ కాలం ఈ నెల 14తో ముగుస్తుండ‌గా, కొన్ని రాష్ట్రాల్లో ఈ గ‌డువును పెంచాల‌ని కోరుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఏప్రిల్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. ఇక తాజాగా మ‌రో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జూన్ 10 వరకు స్కూళ్లు మూసివేయాలని నిర్ణయంచారు. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిప్పుడు బెంగాల్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నాయి. కానీ గత మూడు వారాల్లో కేసులు సంఖ్య విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో దాదాపు 10 కరోనావైరస్‌ హాట్‌స్పాట్‌ కేంద్రాలను గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. లాక్ డౌన్ కొనసాగింపు అంశం మీద ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. అయితే, స్కూళ్ల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 10 వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, బెంగాల్‌లో ఇప్పటి వరకు 126  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు.