లాక్డౌన్ః వెనక్కి తగ్గిన యూపీ సర్కార్
హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో రోజుకు 12 గంటలు పనిచేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన
కరోనా, లాక్డౌన్ కారణంగా దేశంలోని అన్ని వ్యవస్థలు స్థంబించిపోయాయి. దీంతో దేశంలోని ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు కూడా తలకిందులుగా మారిపోయే పరిస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికంటూ పనిగంటలు పెంచేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలహాబాద్ హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో పెంచిన పనిగంటల ఆర్డినెన్సును వెనక్కి తీసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో కార్మికులు రోజుకు 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన సంగతి తెలిసింది. అయితే ఇది కార్మిక చట్టాలను కాలరాయడమేని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కార్మికుల పనిగంటలు పెంచుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో రోజుకు 12 గంటలు పనిచేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన యోగి సర్కార్ ఎప్పట్లాగే 8 గంటలు పనిచేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.