బ్రేకింగ్: నేపాల్ పోలీసుల కాల్పులు.. భారత్‌ పౌరుడు మృతి

| Edited By:

Jun 12, 2020 | 12:55 PM

ఇండో-నేపాల్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నలుగురు భారత పౌరులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బీహార్ సోన్ బర్సా సరిహద్దులోని జానకీనగర్‌లో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై..

బ్రేకింగ్: నేపాల్ పోలీసుల కాల్పులు.. భారత్‌ పౌరుడు మృతి
Follow us on

ఇండో-నేపాల్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నలుగురు భారత పౌరులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బీహార్ సోన్ బర్సా సరిహద్దులోని జానకీనగర్‌లో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా గత కొద్ది రోజులుగా భారత్‌, నేపాల్‌ల మధ్య సరిహద్దు వివాదం జరుగుతూనే ఉంది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మూడు పట్టణాలు లిపులేక్, కాలాపాని, లింపియాధురా పట్టణాలను తమవే అంటూ నేపాల్ ఓ కొత్త మ్యాప్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Read More:

బిగ్ బ్రేకింగ్: హైదరాబాద్ కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లో పాజిటివ్ కలకలం

పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో

ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు.. న్యూ కండిషన్స్ ఇవే!

అభిమాని అద్భుతమైన స్కెచ్.. జీవితానికి ఇది చాలంటున్న సోనూ..