బిగ్ బ్రేకింగ్: హైదరాబాద్ కరోనా టెస్టింగ్ ల్యాబ్లో పాజిటివ్ కలకలం
హైదరాబాద్ కరోనా టెస్టింగ్ ల్యాబ్లో కోవిడ్ పాజిటివ్ రావడం కలకలంగా మారింది. ఉస్మానియా మెడికల్ కాలేజీ కరోనా ల్యాబ్లోని డేటా ఆపరేటర్కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే టెస్టింగ్ ల్యాబ్లో శానిటైజేషన్ చేశారు జీహెచ్ఎంసీ సిబ్బంది. అలాగే ముందు జాగ్రత్తగా మూడు రోజులపాటు...
హైదరాబాద్ కరోనా టెస్టింగ్ ల్యాబ్లో కోవిడ్ పాజిటివ్ రావడం కలకలంగా మారింది. ఉస్మానియా మెడికల్ కాలేజీ కరోనా ల్యాబ్లోని డేటా ఆపరేటర్కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే టెస్టింగ్ ల్యాబ్లో శానిటైజేషన్ చేశారు జీహెచ్ఎంసీ సిబ్బంది. అలాగే ముందు జాగ్రత్తగా మూడు రోజులపాటు ల్యాబ్ని మూసివేశారు అధికారులు.
కాగా ప్రస్తుతం తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం కొత్తగా మరో 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4320కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 175 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మరణించారు. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read More:
పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్వో