కరోనావైరస్ లాక్ డౌన్ కాలంలో వలస కూలీల వెతలు ఇన్నీ అన్ని కావు. లాక్ డౌన్ నేపథ్యంలో తాము ఉంటున్న ప్రాంతాల్లో పట్టెడన్నానికి నోచుకోక తమ తమ కుటుంబాలతో స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. రైళ్లు,ట్రక్కులు, బస్సులు..ఏది తమను గమ్యం చేరుస్తుందో తెలియకున్నా.. ఆ వాహనాన్నే శరణు వేడుతున్నారు. ఛత్తీస్ గడ్ లో ఓ నిరుపేద కుటుంబం అప్పటికే కిక్కిరిసి ఉన్న ఓ ట్రక్కులో ఎక్కేందుకు పడుతున్న పాట్లను కెమెరామెన్లు తమ కెమెరాల్లో ఎక్కించారు. ఒక చేత్తో చంటిబిడ్డను, మరో చేత్తో ఆ ట్రక్కు తాడును పట్టుకుని హడావుడిగా ఎక్కుతున్న ఓ వ్యక్తి తాలూకు దృశ్యమే ఇందుకు నిదర్శనం. 20 సెకండ్ల వీడియోలో బహుశా ఆ వ్యక్తి కుటుంబంలోని మహిళ కూడా నానా అవస్థలు పడుతూ ఆ వాహనాన్ని ఎక్కేందుకు పడిన శ్రమ ఇది.. ఈ వలస కూలీలంతా రాయ పూర్ నుంచి ఝార్ఖండ్ వెళ్తున్నారట..
heart-breaking picture showing a man holding an infant in one hand as he clings on to a rope hanging on the vehicle with another in raipur @ndtvindia @ndtv #NursesDay #LockdownEnd #COVID19 pic.twitter.com/F4YhUWLyA0
— Anurag Dwary (@Anurag_Dwary) May 12, 2020