“మహా”లో రికార్డుస్థాయి కరోనా కేసులు

|

Sep 01, 2020 | 3:02 PM

మ‌హారాష్ర్ట‌లో క‌రోనా వైర‌స్ విలయ‌తాండ‌వం కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 5,368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,11,987కు చేరుకుంది.

మహాలో రికార్డుస్థాయి కరోనా కేసులు
Follow us on

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ విలయ‌తాండ‌వం కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 5,368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,11,987కు చేరుకుంది. ఇక అంతే స్థాయిలో 204 మంది మృతి కరోనాతో చెందారు. ఇప్పటి వరకు మ‌హారాష్ర్ట‌లో 9,026 మంది కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 87,681 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మ‌హారాష్ర్ట‌లో క‌రోనా నుంచి కోలుకున్న వారు 54.37 శాతం మంది ఉన్నార‌ని ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబైలోనే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ 85,724 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. థానేలో 49,485, పుణెలో 28,966, పాల్గ‌ర్ లో 7,823, ఔరంగాబాద్ లో 6,812 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.