దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా పేదోడు ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో అవి ఎవరికీ కనిపించట్లేదు. పట్టెడన్నం కోసం రోజంతా కాయకష్టం చేస్తూ బ్రతికే వేలాది మంది బ్రతుకులు ఈ మహమ్మారి కారణంగా చితికిపోయాయి. పని చేస్తేనే గానీ పూట గడవని వాళ్ల కుటుంబాలు ఆదరించే చెయ్యి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఆగ్రాలో రోడ్డుపై ఒలికిన పాలను పేదవాడు ఓ గిన్నెలోకి ఎత్తడానికి ప్రయత్నించాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత శ్రీవత్స ట్వీట్ చేశారు. ‘దేశవ్యాప్తంగా ఆకలి కేకలను చూస్తుంటే గుండె బరువెక్కుతోందని.. నమస్తే ట్రంప్కు రోడ్ల చుట్టూ పూల డెకరేషన్కు రూ. 3 కోట్లు ఖర్చు చేశారు.. అలాంటిది ఈ పేదోడి ఆకలి తీర్చలేరా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.’ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి పేదోళ్ల ఆకలిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇవి చదవండి:
లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!
అక్తర్కు అఫ్రిదీ వత్తాసు.. మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..
Heartbreaking scenes of hunger from across India
This one from Agra where a poor man is trying to collect milk spilled on the street?
Is it so difficult to feed the hungry when we can plan Namaste Trump so well & spend ₹3cr on flowers for his roadshow?pic.twitter.com/4aWf9iQRpe
— Srivatsa (@srivatsayb) April 13, 2020