షాకింగ్.. డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే కరోనా పాజిటివ్..!

| Edited By:

Apr 13, 2020 | 7:48 PM

కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ సోకడంతో.. ఇద్దరు బాధితులు డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది.

షాకింగ్.. డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే కరోనా పాజిటివ్..!
Follow us on

కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ సోకడంతో.. ఇద్దరు బాధితులు డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. కరోనా సోకిన ఇద్దరు వ్యక్తులు నోయిడాలోని గవర్న్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందారు. నిబంధనల ప్రకారం కరోనా నుంచి కోలుకున్నా.. 24 గంటల వ్యవధిలో బాధితులకు రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలి. ఈ ఫలితాల్లో రెండుసార్లు నెగిటివ్ వచ్చింది. దీంతో శుక్రవారం డిశ్చార్జి చేశారు.

ఇక డిశ్చార్జి సమయంలో మరోసారి వారి నుంచి నమూనాలను తీసుకుని పరీక్షలు నిర్వహించగా.. అందులో పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారిద్దరినీ తిరిగి ఆసుపత్రుల్లో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ఈ సంఘటనపై వైద్యాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9వేలు దాటేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,352 కేసులు నమోదు కాగా.. 324 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read This Story Also: సోనాక్షితో డేటింగ్.. సల్మాన్ ఫ్రెండ్ కుమారుడు ఏమన్నాడంటే..!