తెలంగాణలో కరోనా మహమ్మారి కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరి పీల్చుకోగా.. సడన్గా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ వరుసగా మూడు, నాలుగు రోజులు సింగిల్ డిజిట్ కేసులు నమోదవ్వగా.. అకస్మాత్తుగా డబుల్ డిజిట్కు చేరుకుంటున్నాయి. తాజాగా శనివారం కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ కోవిడ్ కేసుల సంఖ్య 1061కి చేరుకుంది. ఇప్పటివరకూ 29 మంది కరోనాతో మృతి చెందారు.
ఈ నేపథ్యంలో అధికారులు రాష్ట్రంలోని రెడ్ జోన్లు, గ్రీన్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లు వంటి వాటిని గుర్తించి.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని కంటైన్మెంట్ జోన్ల ఏరియాల లిస్ట్ను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9 కేంద్రాలు, హైదరాబాద్ పరిధిలో 30 కంటైన్మెంట్ కేంద్రాలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 కంటైన్మెంట్ కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
List of Containment zones in #Hyderabad . There are total 54 containment zones in the city! #StayHomeStaySafe #TelanganaFightsCorona#IndiaFightsCornona pic.twitter.com/NNsqlZqele
— Sumiran Komarraju (@Sumiran_KVS) May 2, 2020
Read More:
గుడ్న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’
బాలీవుడ్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!