
వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న వేయొద్దని కేసీఆర్ సూచించారు. యాసంగిలో కావాలంటే ఈ పంటను పండించాలని, ఎంత పండించాలన్నది ప్రభుత్వం చెబుతుందని ఆయన వివరించారు. డిమాండ్ ఉన్న పంటలే రైతులు వేయాలని ఆయన అన్నారు. వ్యవసాయంపై మాట్లాడిన ఆయన.. తెలంగాణలో అన్ని రకాల పంటలు పండుతాయని అన్నారు. వానాకాలంలో మొక్క పంట వద్దని కందులు వేయాలన్న కేసీఆర్ తెలిపారు. డిమాండ్ ఉన్న పంటల వలనే రైతులు లాభపడతారని ఆయన సూచించారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు సీఎం.
Read This Story Also: Big Breaking: తెలంగాణలో అన్ని షాపులు, సేవలకు పర్మిషన్..!