కరోనాపై యుద్ధం.. టాలీవుడ్ సెలబ్రిటీల ఔదార్యం.. ఏ స్టార్ ఎంత ఇచ్చారంటే..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై దేశాధినేతలు యుద్దం ప్రకటించారు. ఈ మహమ్మారి ఆటను ఎలాగైనా కట్టేయాలని వారందరూ దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు.

కరోనాపై యుద్ధం.. టాలీవుడ్ సెలబ్రిటీల ఔదార్యం.. ఏ స్టార్ ఎంత ఇచ్చారంటే..!
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2020 | 8:03 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై దేశాధినేతలు యుద్దం ప్రకటించారు. ఈ మహమ్మారి ఆటను ఎలాగైనా కట్టేయాలని వారందరూ దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భారత్‌ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. వచ్చే నెల 15వరకు అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని ఆయన సూచించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మోదీ ఇచ్చిన సూచన మేరకు ప్రజలు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఈ మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధానికి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. మొదట నితిన్, ఆ తరువాత పవన్ కల్యాణ్.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ఇవ్వగా.. తాజాగా ఆ లిస్ట్‌లో మరికొందరు చేరారు.

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు.. ఇరు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే ఆర్ఆర్ఆర్ హీరోలైన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ.70లక్షల రూపాయలు, ఎన్టీఆర్ రూ.75లక్షలు ప్రకటించారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కోటి రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.  అలాగే సాయి ధరమ్ తేజ్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.5లక్షలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.10లక్షలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇక దర్శకులు త్రివిక్రమ్‌ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.10లక్షలు, కొరటాల శివ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.5లక్షలు అనిల్ రావిపూడి ఇరు రాష్ట్రాలకు చెరో రూ.5లక్షలు తన వంతు సహాయం ప్రకటించారు సినీ ప్రముఖులు. ఇక నాంది సినిమా నటుడు, నిర్మాత అల్లరి నరేష్, సతీష్ వేగేష్న సైతం తన నాంది సినిమా కోసం పనిచేస్తున్న 50 మందికి పైగా సినీ కార్మికులకు 10వేల రూపాయాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఒకడుగు ముందుకేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ కార్మికుల కోసం రూ.కోటి రూపాయలను ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక రాజశేఖర్ దంపతులు కూడా తమ ఫౌండేషన్ ద్వారా సినీ కార్మికులకు రోజువారీ సరుకులు ఇస్తామని తెలిసిన విషయం తెలిసిందే. ఏదేమైనా సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ మేమున్నామంటూ రియల్ హీరోలుగా ముందుకొస్తోన్న మన టాలీవుడ్ ప్రముఖులకు హ్యాట్సాఫ్.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్ః హృతిక్ ఇంటికి చేరుకున్న మాజీ భార్య..!