ఆరోగ్య కార్యకర్తలకు భారీగా వేతనాలు..ఫ్రెంచ్ ప్రభుత్వ నిర్ణయం
కరోనా మహమ్మారితో తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న వైద్యులకు ఫ్రెంచ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గత ఏడు వారాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన వైద్య సిబ్బంది డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కార్మిక సంఘాలతో..
ప్రపంచ దేశాలతో పాటు ఫ్రాన్స్ను కరోనా మహమ్మారి పట్టి పిడిస్తోంది. దేశంలో వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. వైరస్ మహమ్మారి కుదిపేస్తున్నా ప్రభుత్వం ఆసుపత్రులకు తగిన వసతులను కల్పించడం లేదని, ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు కూడా కరువయ్యాయని ఆరోపిస్తూ ఫ్రాన్స్లో వైద్యసిబ్బంది ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి వైద్యులు, సిబ్బంది గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
కొవిడ్-19 చికిత్సకు కనీసం అవసరమైన పరికరాలు కూడా లేవంటూ నిరసన తెలిపారు. భయం భయంగా చికిత్స చేయాల్సి వస్తోందని వైద్యులు తమ ఆవేదన వెల్లగక్కారు. గతంలోనే వైద్యులు, వైద్య సిబ్బంది భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళనలు చేశారు. వైద్యులకు సరైన జీతాలు కూడా చెల్లిండం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే గత ఏడువారాలుగా ఫ్రెంచ్ సర్కార్తో ఆరోగ్య కార్యకర్తలు జరుపుతున్న చర్చలు ఫలించాయి. వేతనాల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనా మహమ్మారితో తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న వైద్యులకు ఫ్రెంచ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గత ఏడు వారాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన వైద్య సిబ్బంది డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కార్మిక సంఘాలతో ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. కరోనా వైరస్పై పోరాటంలో వారి పాత్రను ప్రశసించిన ప్రభుత్వం వారికి 8 బిలియన్ యూరోల వేతనాల పెంపుకు అంగీకారం తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంతో వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.