తమిళనాట ఆగని కరోనా విజృంభణ.. 8వేలు దాటేసిన కేసులు..!
తమిళనాట కరోనా విజృంభణ ఆగడం లేదు. రోజురోజుకు అక్కడ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8వేలను దాటేసింది.
తమిళనాట కరోనా విజృంభణ ఆగడం లేదు. రోజురోజుకు అక్కడ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8వేలను దాటేసింది. ప్రస్తుతం తమిళనాడులో కరోనా పాజిటివ్ సంఖ్య 8,002గా నమోదైంది. ఇవాళ ఒకే రోజు రికార్డు స్థాయిలో అక్కడ 798 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నైలోనే 538 కేసులు నమోదు కావడం గమనర్హం. మరోవైపు మృతుల సంఖ్య 53కు చేరింది. కోయంబేడు మార్కెట్ కేంద్రంగా కరోనా కేసుల విజృంభణ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Read This Story Also: నీ కన్ను నీలి సముద్రం@ 50 మిలియన్లు..!