కోడిపై కరోనా దెబ్బ..రూపాయికే కమ్మనైన చికెన్ బిర్యానీ

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్ 100 దేశాలకు విస్తరించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక రంగం కుదేలవుతోంది. అంతేకాదు ప్రపంచ దేశాలు మధ్య ఎగుమతులు, దిగుమతుల మందగించాయి. ఇండియా సహా పలు దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి. మరోవైపు కరోనా వైరస్ ప్రభావం ఫౌల్ట్రీ పరిశ్రమపై నీలినీడలు కమ్మేసింది. నాన్ వెజ్ ద్వారా కరోనా వ్యాపిస్తుందని వదంతులు వ్యాపించడంతో..ఎందుకైనా మంచిదని ప్రజలు మాంసం […]

కోడిపై కరోనా దెబ్బ..రూపాయికే కమ్మనైన చికెన్ బిర్యానీ
Follow us

|

Updated on: Mar 14, 2020 | 2:56 PM

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్ 100 దేశాలకు విస్తరించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక రంగం కుదేలవుతోంది. అంతేకాదు ప్రపంచ దేశాలు మధ్య ఎగుమతులు, దిగుమతుల మందగించాయి. ఇండియా సహా పలు దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి.

మరోవైపు కరోనా వైరస్ ప్రభావం ఫౌల్ట్రీ పరిశ్రమపై నీలినీడలు కమ్మేసింది. నాన్ వెజ్ ద్వారా కరోనా వ్యాపిస్తుందని వదంతులు వ్యాపించడంతో..ఎందుకైనా మంచిదని ప్రజలు మాంసం షాపులవైపు చూడటమే మానేశారు. దీంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బర్త్ ప్లూ వల్ల కోళ్ళు వేల సంఖ్యలో చనిపోవడంతో ప్రజల్లో భయం మరింత నాటుకుపోయింది. పలువురు నిపుణులు, రాజకీయ నాయకులు సైతం కరోనాకు, కోళ్లకు ఏం సంబంధం లేదని చెప్తున్నా ప్రజల్లో మాత్రం నమ్మకం కలగడం లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని ఏరియాల్లో కేజీ చికెన్ రూ.10 నుంచి రూ. 50 వరకు అమ్మకాలు జరుపుతున్నారు.

ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ వ్యాపారులు, హెటల్ యజమానులు ప్రజల్లోని అప నమ్మకాన్ని పొగొట్టడానికి విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడులోని తిరువల్లూరులో కొత్త హోటల్‌ను ఇటీవలే ప్రారంభించారు. కస్టమర్లు పెద్దగా హోటల్‌కి రాకపోవడంతో ఆయన ఓ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించారు. రూ. 1కే ధమ్ బిర్యానీ, రూ. 3కే నాటుకోడి చికెన్‌తో పరోటాను అందించారు. దీంతో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. రాత్రి వరకు వస్తుందనుకున్న భోజనం మధ్యాహ్నం 2 గంటలకే అయిపోయింది.