‘ఆటో జానీ’కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..!
మెగాస్టార్ చిరంజీవి- డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ కాంబినేషన్లో సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. తన సినిమాలో హీరోలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే పూరీ.. మెగాస్టార్ను ఎలా చూపిస్తారో అని మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే పూరీకి ఈ ఛాన్స్ రెండు సార్లు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యింది. ఆంధ్రావాలా ఫెయిల్ తరువాత చిరుకు ఓ కథను చెప్పి ఓకే చెప్పించుకున్నాడు పూరీ. ఈ సినిమాకు శ్రీకృష్ణుడు అనే టైటిల్ను […]
మెగాస్టార్ చిరంజీవి- డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ కాంబినేషన్లో సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. తన సినిమాలో హీరోలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే పూరీ.. మెగాస్టార్ను ఎలా చూపిస్తారో అని మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే పూరీకి ఈ ఛాన్స్ రెండు సార్లు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యింది. ఆంధ్రావాలా ఫెయిల్ తరువాత చిరుకు ఓ కథను చెప్పి ఓకే చెప్పించుకున్నాడు పూరీ. ఈ సినిమాకు శ్రీకృష్ణుడు అనే టైటిల్ను కూడా ఖరారు చేసుకున్నారు. అయితే కారణాలు తెలీదు గానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఇక ఆ తరువాత చిరంజీవి రీ ఎంట్రీ ఆఫర్ కూడా మొదట పూరీకే వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ ఫైనల్ స్క్రిప్ట్ సరిగా లేదని ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశాడు చిరు(అయితే ఈ విషయాన్ని పూరీకి డైరక్ట్గా చెప్పకుండా చిరు మీడియా ముందు చెప్పగా, పూరీ జగన్నాథ్ కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతోనే ఈ విషయాన్ని చెప్పి ఉండే బావుండేదని పూరీ చెప్పుకొచ్చారు). ఇలా రెండు సార్లు ఈ కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయింది. అయితే ఫ్యాన్స్ మాత్రం చిరు-పూరీ కాంబినేషన్లో సినిమా రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. దానికి తోడు పూరీ కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. చిరుకు నచ్చే వరకు కథలు చెప్తూనే ఉంటానని, ఆయనతో సినిమా కచ్చితంగా చేస్తానని వెల్లడించారు.
అయితే తాజా సమచారం ప్రకారం పూరీ తన కథతో చిరంజీవిని ఒప్పించినట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు అనుకున్న ఆటో జానీ కథనే చిరుకు వినిపించినట్లు టాక్. ఫైనల్ స్క్రిప్ట్ను విన్న చిరు.. వెంటనే పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
కాగా ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో 152వ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాను తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్లు పూర్తైన వెంటనే ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుంది. అంటే ఈ ఏడాది చివర్లో ఇది తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్కు ఇదొక శుభవార్తనే.