
హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్ ఫలితలను విడుదల చేశారు. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,07,949 మంది ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో 4,89,123, సెకండ్ ఇయర్లో 3,58,490 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రాల వారీగా చూస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మేడ్చల్ 77.31 శాతం మార్కులతో టాప్లో నిలిచింది. మహబూబాబాద్ జిల్లా 44.91 శాతంలో అత్యల్ప ఉత్తీర్ణత పొందింది. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్లోనూ మేడ్చల్ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యల్పంగా 20 శాతం మంది విద్యార్ధులు మాత్రమే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత పొందారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.