
హైదరాబాద్, మే 25: తెలంగాణ ఈసెట్ ఫలితాలు ఆదివారం (మే 25) మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదలైనాయి. మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్ష రాసిన విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు మే12న నేడు ఈసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ఈసెట్ పరీక్ష ఫలితాలు ఆదివారం (మే 25) మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈసెట్ ఫలితాల్లో మొత్తం 93.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. మెటలార్జికల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఇక ఎప్పటి మాదిరిగానే అన్ని విభాగాల్లో అమ్మాయిలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. విద్యార్ధులు తమ వివరాలు నమోదు చేసి ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ర్యాంకు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఈసెట్ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.