
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 7,267 టీచర్, నాన్ టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి ప్రిన్సిపల్ పోస్టులకు 50 ఏళ్లు, పీజీటీకి 40 ఏళ్లు, టీజీటీకి 35 ఏళ్లు, అకౌంటెంట్కు 30 ఏళ్లు, ల్యాబ్ అటెండెంట్కు 30 ఏళ్లు, హాస్టల్ వార్డెన్, ఫీమేల్ స్టాఫ్ నర్స్కు 35 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అటెండెంట్కు 30 ఏళ్లుగా నిర్ణయించారు.
ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ఆధారంగా అక్టోబర్ 23, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిన్సిపల్ పోస్టుకు రూ.2,500, టీజీటీ, పీజీటీ పోస్టులకు రూ.2,000, నాన్-టీచింగ్ పోస్టులకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మహిళా అభ్యర్థులకు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.