CSIR-UGC NET 2025 December: సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తులు

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ (నెట్‌) డిసెంబర్‌ 2025 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. యేటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి డిసెంబర్‌ సెషన్‌కు సంబంధించిన ప్రకటనను యూజీసీ తాజాగా జారీ చేసింది. ఈ పరీక్ష..

CSIR-UGC NET 2025 December: సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తులు
CSIR UGC NET December 2025 Notification

Updated on: Sep 29, 2025 | 10:42 AM

సీఎస్‌ఐఆర్‌ – యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) డిసెంబర్‌ 2025 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. యేటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి డిసెంబర్‌ సెషన్‌కు సంబంధించిన ప్రకటనను యూజీసీ తాజాగా జారీ చేసింది. ఈ పరీక్ష ద్వారా సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించేందుకు జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలకు అర్హత కల్పిస్తారు. అలాగే పీహెచ్‌డీ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 29, 2025వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2025 పరీక్షను మొత్తం 6 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. కెమికల్‌ సైన్సెస్ , ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్, మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌.. ఈ ఆరు పేపర్లకు పరీక్ష జరిగింది. దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందితే సరిపోతుంది. అయితే జేఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేయాలంటే జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు డిసెంబర్‌ 2025 నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 24, 2025వ తేదీలోపు పూరించాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.1150, జనరల్ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.325 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్‌ 24,2025.
  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: అక్టోబర్‌ 25, 2025.
  • దరఖాస్తు సవరణ తేదీలు: అక్టోబర్‌ 27 నుంచి 29 వరకు.
  • రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 18, 2025.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.