
ఇంజినీరింగ్ చదివేవారికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయమంత్రి జితేంద్ర జింగ్ శుభవార్త అందించారు. 2020 నాటికి ఏఐ, స్మార్ట్ గ్రిడ్లు, అధునాతన డిజిటలం మౌలిక సదుపాయాల్లో భారీగా ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలిపారు. ఈ రంగాల్లో లక్ష ఇంజినీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని స్పష్టం చేశారు. 2030 నాటికి భారత్లో డేటా సెంటర్ సామర్థ్యం 1.5 గిగావాట్ల నుంచి 6.5 గిగావాట్లకు పెరిగే అవకాశముందని అన్నారు. ఇది మరింత విస్తరించనుందని, దీని వల్ల లక్ష ఇంజినీరింగ్ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని పేర్కొన్నారు.
అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 6జీ, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలతో భారత్ వేగంగా అభివృద్ది చెందుతుందని, దీంతో ప్రపంచ పెట్టుబడులు, టెక్నాలజీ సహాకారం, పర్యావరణ వ్యవస్థతో అనేక అవకాశాలు లభించనున్నాయన్నారు. డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ వంటి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను తీర్చిదిద్దే కీలక దశలోకి భారత్ ప్రవేశిస్తోందని, ఈ రంగాల్లో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని తెలిపారు. ఈ రంగాల్లో గ్లోబల్ డేటా సెంటర్గా భారత్ను తీరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. ఇతర చోట్ల ఆవిష్కరణల కోసం ఎదురుచూడకుండా భారత్నే కొత్త ఆవిష్కరణలు చేసేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు. భవిష్యత్ మొత్తం డేటా నియంత్రణ, డిజిటల్ మౌలిక సదుపాయలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థల చుట్టూ తిరుగుతుందని తెలిపారు. భారత్ ఇప్పుడు అగ్రగామి దేశాలతో సమానంగా సాంకేతికంగా అభివృద్ది సాధిస్తోందన్నారు. భారత్ 8 ఏళ్లల్లో 32 వలే కిలోమీటర్ల క్వాంటం కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను ఏ్ర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టుందని, కానీ మూడేళ్లలోనే వెయ్యి కిలోమీటర్లకు దాటిందని పేర్కొంది.