ATM: ఇక బాదుడే.. బాదుడు.. మే 1 నుంచి ఏటీఎం నిబంధనలు మార్పు.. ఛార్జీల మోత!

|

Mar 25, 2025 | 7:26 PM

ATM Rules: మీరు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తుంటారా..? అయితే మే 1వ తేదీ నుంచి ఏటీఎం విత్‌డ్రాలో నిబంధనలు మారనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఏటీఎంల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఛార్జీలను పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

ATM: ఇక బాదుడే.. బాదుడు.. మే 1 నుంచి ఏటీఎం నిబంధనలు మార్పు.. ఛార్జీల మోత!
Follow us on

మీకు నుంచి నుండి పదే పదే డబ్బులు తీసుకునే అలవాటు ఉంటే, కొన్ని రోజుల్లోనే ఈ అలవాటును సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. మే 1 నుండి ఏటీఎం నుండి డబ్బు తీసుకోవడం ఖరీదైనదిగా మారబోతోంది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఏదైనా ఉపసంహరణ జరిగితే లేదా హోమ్ బ్యాంక్ నెట్‌వర్క్ వెలుపల ఉన్న ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ చేస్తే అది మీకు మునుపటి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.

ఏటీఎం ఛార్జీలు ఎంత పెరుగుతాయి?

గతంలో మీరు మీ హోమ్‌ బ్రాంచ్‌ బ్యాంకు ఏటీఎం నుండి కాకుండా వేరే బ్యాంకు ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటే మీరు రూ. 17 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు అది రూ. 19 అవుతుంది. ఇతర బ్యాంకు ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి, గతంలో ఒకరు 6 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడది 7 రూపాయలకు పెరగనుంది.

ఉచిత లావాదేవీ పరిమితి:

లావాదేవీ రుసుము ఇతర బ్యాంకు ఏటీఎం నుండి మాత్రమే వసూలు చేయబడుతుంది. మీరు ఉచిత లావాదేవీ పరిమితిని దాటినప్పుడు మెట్రో నగరాల్లో, హోమ్ బ్యాంక్ కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి ఉచిత లావాదేవీల పరిమితి 5 అయితే, మెట్రోయేతర నగరాల్లో ఉచిత లావాదేవీల పరిమితి 3. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC) పంపిన ATM ఫీజులను పెంచే ప్రతిపాదనను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి