AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Group: ఇప్పుడు వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.. కొత్త రూల్‌!

WhatsApp Group: వాట్సాప్‌.. దీని గురించి తెలియనివారంటూ ఉండరేమో. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోనే మునిగి తేలుతుంటారు. అయితే ఇక్కడ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేయాలంటే డబ్బులు కట్టాల్సిందే.. ఇది ఎక్కడో తెలుసా?

WhatsApp Group: ఇప్పుడు వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.. కొత్త రూల్‌!
Subhash Goud
|

Updated on: Nov 09, 2024 | 10:37 AM

Share

WhatsApp Group: జింబాబ్వే ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. ఇప్పుడు WhatsApp గ్రూప్ అడ్మిన్‌లందరూ జింబాబ్వే పోస్ట్, టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (POTRAZ)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి గ్రూప్‌ను క్రియేట్‌ చేయడానికి లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కోసం వారు కూడా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ కనీసం $50 (సుమారు రూ.4220) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్, కొరియర్ సర్వీసెస్ (ICTPCS) మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: BSNL: ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు దడ పుట్టిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 4 ప్లాన్స్‌!

కొత్త వాట్సాప్ రూల్ ఎందుకు ప్రవేశపెట్టింది?

తప్పుడు వార్తలు, తప్పుడు పోస్టులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశంలో శాంతి నెలకొనేందుకు ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఇది దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కొత్త రూల్స్‌ తీసుకువచ్చింది తెలిపింది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి. అందుకే ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.

మంత్రి ఏం చెప్పారు..

తప్పుడు సమాచారం మూలాలను ట్రాక్ చేయడానికి లైసెన్సింగ్ సహాయపడుతుందని సమాచార మంత్రి మోనికా ముత్స్వాంగ్వా అన్నారు. ఇది చర్చిల నుండి వ్యాపారాల వరకు సంస్థలను ప్రభావితం చేసే డేటా రక్షణపై నియమాలతో పాటు వస్తుంది.

ప్రజలు ఏమంటున్నారు..

ఈ నిబంధన ప్రకారం, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ తమ గ్రూప్‌ను నడపడానికి ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకోవాలి. ఈ లైసెన్స్ పొందడానికి, నిర్వాహకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని కొంత ప్రభుత్వానికి అందించాలి. అలాగే కొంత రుసుము కూడా చెల్లించాలి. దేశ భద్రతకు ఈ నిబంధన అవసరమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది మాట్లాడే స్వేచ్ఛను తగ్గిస్తుందని భావిస్తోంది. వాట్సాప్ కూడా ఫేక్ న్యూస్‌పై పోరాడేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే, ఈ కొత్త నిబంధన చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ నియమం చాలా కఠినమైనదని, ప్రజలపై చెడు ప్రభావం చూపుతుందని ప్రజలు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Malware Attack: ఆండ్రాయిడ్‌ యూజర్లకు పెను ముప్పు.. మొబైళ్లలో మరో కొత్త మాల్వేర్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి