
వేసవిలో ఏసీ వినియోగం పెరగడం వల్ల వచ్చే భారీ విద్యుత్ బిల్లులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై పలు ఆసక్తికరమైన చిట్కాలు మీకోసం. చాలామంది ఏసీని 16 లేదా 18 డిగ్రీల లాంటి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచుతుంటారు. కానీ ఇది కరెంట్ బిల్లు పెరగడానికే కాకుండా ఏసీ పనితీరు దెబ్బతినడానికి కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏసీని ఎప్పుడూ 24-25 డిగ్రీల వద్ద నిర్వహించడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఈ ఉష్ణోగ్రత వద్ద కంప్రెసర్ అవసరమైనప్పుడు ఆగి, మళ్ళీ స్టార్ట్ అవ్వడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.
ఇది చదవండి: గ్యాస్ స్టవ్లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..
ఏసీ నిర్వహణ విషయానికి వస్తే, వేసవి ప్రారంభానికి ముందే పూర్తిస్థాయి సర్వీసింగ్ చేయించడం ముఖ్యం. దీనివల్ల గ్యాస్ లీక్లు లాంటి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. అలాగే ఏసీని నిరంతరం వాడుతున్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతే ఏసీ గదిని చల్లబరచడానికి ఎక్కువ కరెంటును తీసుకుంటుంది. ఫిల్టర్లు శుభ్రంగా ఉంటే గాలి నాణ్యత పెరగడమే కాకుండా ఏసీ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.
విద్యుత్ ఆదా చేయడంలో మన చిన్న చిన్న అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఏసీ నడుస్తున్నప్పుడు గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచకూడదు. అలాగే ఏసీతో పాటు ఫ్యాన్ను తక్కువ స్పీడ్లో ఉంచడం వల్ల చల్లని గాలి గది అంతా త్వరగా వ్యాపిస్తుంది. రాత్రిపూట టైమర్ సెట్టింగ్ను ఉపయోగించి ఒక నిర్ణీత సమయం తర్వాత ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా చూసుకోవచ్చు. ఇక భద్రత పరంగా ఏసీ యూనిట్ను వీలైనంత వరకు ఎండ తగలకుండా నీడలో ఉంచడం, వాడనప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఈ చిన్నపాటి మార్పుల ద్వారా ఏడాదికి సుమారు 400 యూనిట్ల వరకు విద్యుత్తును ఆదా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..