
బంగారం ధర కొన్ని నెలలుగా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.98,840కి చేరుకుంది. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా డబ్బులు తీసుకుని బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తాం. ఈ విధానంలో మన వద్ద భౌతికంగా బంగారం ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ లు అంటే డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనడం. ఈ విధానంలో మన చేతిలో భౌతికంగా బంగారం ఉండదు. కానీ డిజిటల్ రూపంలో ఉంటుంది. అవసరమైనప్పడు దాన్ని విక్రయించవచ్చు.
గోల్డ్ బెంచ్ మార్క్ ట్రేటెడ్ పథకాలనే గోల్డ్ బీఈఎస్ లు (ఈటీఎఫ్ లు) అంటారు. వీటిని ట్రేడింగ్ రోజుల్లో మార్కెట్ సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంచ్ (ఎన్ఎస్ఈ), బీఎస్ఈలలో కొనుగోలు చేయవచ్చు. ఒక గోల్డ్ బీఈఎస్ యూనిట్ విలువ 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 0.01 గ్రాముల బంగారానికి సమానం. డిమెటీరియలైజ్డ్ లేదా డిజిటల్ రూపంలో ఇవి అందుబాటులో ఉంటాయి. పెట్టుబడిదారులు వీటిని కొనుగోలు చేసుకోని తమ ఖాతాలో ఉంచుకోవచ్చు. ధర పెరిగినప్పుడు, డబ్బులు అవసరమైనప్పుడు విక్రయించుకునే అవకాశం ఉంటుంది.
కంపెనీ స్టాక్ ల మాదిరిగానే గోల్డ్ ఈటీఎఫ్ లను మార్కెట్ సమయంలో ట్రేడింగ్ చేయవచ్చు. దీని కోసం పెట్టుబడిదారులకు డీమ్యాట్ ఖాాతా అవసరం. ఒక్క బీఈఎస్ ఈటీఎఫ్ యూనిట్ ను కొనుగోలు చేసినప్పుడు, మీరు 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 0.01 గ్రాముల బంగారంలో పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది. యూనిట్లు డిజిటల్ రూపంలో ఖాతాలో జమఅవుతాయి. వాటిని అమ్మకం, కొనడం చేయవచ్చు. దీని వల్ల మరో ఉపయోగం ఏమిటంటే దొంగల భయం ఉండదు. భౌతికంగా బంగారం ఇంటిలో ఉంటే దొంగలు చోరీ చేస్తారనే భయం ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ లతో నిశ్చింతంగా ఉండొచ్చు. ఖాతాలోని యూనిట్లను ఎవ్వరూ దొంగిలించలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి