
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు చాలామంది క్యాష్ తో పేమెంట్ చేస్తారు. చిన్న చిన్న దుకాణాల వాళ్లు వాటిని తెలియక యాక్సెప్ట్ చేస్తుంటారు. అయితే ఇలా బంగారాన్ని ఫిజికల్ క్యాష్ తో కొంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం బంగారాన్ని ఎలా కొనాలంటే.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బంగారాన్ని క్యాష్ పెట్టి కొనడానికి లిమిట్ రూ. 2 లక్షలు మాత్రమే. అంటే రూ. 2 లక్షలకు మించి విలువైన బంగారం కొనాలనుకుంటే కచ్చితంగా డిజిటల్ లేదా బ్యాకింగ్ మార్గాల ద్వారా పేమెంట్ చేయాలి. రూ. 2 లక్షల కంటే తక్కువ విలువ చేసే బంగారు ఆభరణాలను క్యాష్ రూపంతో కొనుక్కోవచ్చు.
ఇక మరో రూల్ ఏంటంటే.. రూ. 50 వేల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డు డీటెయిల్స్ ఇవ్వడం తప్పనిసరి. బ్లాక్ మనీ వంటి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ రూల్ తెచ్చింది. రూ. 50 వేలకు మించి విలువైన బంగారాన్ని కొనేటప్పుడు పాన్ కార్డు నెంబర్ నమోదు చేయడం ద్వారా ఆ లావాదేవీ ఎవరు చేశారు అన్న లెక్కలు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు చేరతాయి. తద్వారా మీకు సమస్య లేకుండా ఉంటుంది.
ఇకపోతే ఇంట్లో ఉంచుకునే బంగారంపై కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత మహిళలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారం తమ దగ్గర ఉంచుకోవచ్చు. ఈ లిమిట్ దాటితే ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.