Rose gold trending: మగువలకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ. 2,000కే బంగారం..! దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది…

చాలా మంది గోల్డ్‌ అంటే కేవలం బంగారం, పసుపు లోహం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బంగారం అనేక రంగులలో వస్తుంది. వాటిలో ఒకటి రోజ్ గోల్డ్. ఈ రోజ్ గోల్డ్ రంగు లేత గులాబీ రంగులో ఉంటుంది. ఈ రోజుల్లో మార్కెట్లో రోజ్ గోల్డ్ నగలు కూడా పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నాయి. వీటిని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Rose gold trending: మగువలకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ. 2,000కే బంగారం..! దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది...
Rose Gold

Updated on: Aug 30, 2025 | 3:47 PM

ప్రస్తుతం పసుపు లోహం బంగారం అత్యంత ఖరీదైనదిగా మారింది. దీనిని ఇంగ్లీషులో గోల్డ్‌ అంటారు. చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా ఉపయోగిస్తారు. దీనిని ఆభరణాలుగా కూడా ధరిస్తారు.. గోల్డ్‌ అనే మాట వినగానే పసుపు రంగు బంగారం గుర్తుకు వస్తుంది. చాలా మంది గోల్డ్‌ అంటే కేవలం బంగారం, పసుపు లోహం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బంగారం అనేక రంగులలో వస్తుంది. వాటిలో ఒకటి రోజ్ గోల్డ్. ఈ రోజ్ గోల్డ్ రంగు లేత గులాబీ రంగులో ఉంటుంది. ఈ రోజుల్లో మార్కెట్లో రోజ్ గోల్డ్ నగలు కూడా పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నాయి. వీటిని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

రోజ్ గోల్డ్‌ను రెడ్ గోల్డ్ అని కూడా అంటారు. ఈ రోజుల్లో చాలా మంది మహిళలు సహజ బంగారం కంటే కూడా ఈ రోజ్‌ గోల్డ్‌ ఆభరణాలను ఇష్టపడుతున్నారు.. చాలా అందమైన ఆభరణాలను ఈ రోజ్‌ గోల్డ్‌ తయారు చేసి విక్రయిస్తున్నారు. పసుపు బంగారం కంటే కూడా రోజ్‌ గోల్డ్‌ ఆభరణాలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటున్నాయి.

సహజ బంగారం పసుపు రంగులో మాత్రమే ఉంటుంది. అయితే, ఈ రోజ్‌ గోల్డ్‌ ఎలా తయారవుతుంది..? ఈ గులాబీ బంగారం సహజమా..? ఇలాంటి ప్రశ్నలు మీ మనస్సులో కూడా తిరుగుతుంటే, ఇక్కడ సమాధానం ఉంది..

ఇవి కూడా చదవండి

రోజ్ గోల్డ్.. బంగారం, రాగిని కలిపి తయారు చేస్తారు. అవును, సహజ బంగారం కేవలం పసుపు రంగులో ఉంటుంది. కానీ, దానికి కొద్దిగా రాగి కలిపితే, దాని రంగు లేత గులాబీ రంగులోకి మారుతుంది. ఈ మిశ్రమంతో, మనకు రోజ్ గోల్డ్ లభిస్తుంది. దీని కారణంగా, ఇది స్వచ్ఛమైన బంగారం కంటే కొంచెం చౌకగా ఉంటుంది.

ఇది భారతదేశం అంతటా ప్రజాదరణ పొందింది. కేవలం రూ. 2,000 నుండి లభిస్తుంది. బాలీవుడ్ సెలబ్రిటీలు దీనిని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. సహజ బంగారం కొనలేని వారికి గులాబీ బంగారాన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచారు. ఉదాహరణకు, నటి శ్రద్ధా కపూర్ ‘పాల్మోనాస్’ అనే సంస్థను నడుపుతోంది. దీని ద్వారా ఆమె సామాన్యులలో బంగారం పై ఉన్న ఆశలను తీరుస్తుందని చెప్పవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి