రూ. లక్షకు ఏకంగా రూ. 19 కోట్లా.! లాటరీ టికెట్ కాదు.. ఓ సామాన్యుడు ఈజీగా కోటీశ్వరుడిగా మారొచ్చు..

కొన్ని పెన్నీ స్టాక్స్ లక్ష రూపాయల పెట్టుబడిని ఏకంగా కోట్లుగా మార్చాయి. టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, Eicher మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ఏళ్ల పెట్టుబడికి అధిక రాబడిని అందించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇది చూసేయండి.

రూ. లక్షకు ఏకంగా రూ. 19 కోట్లా.! లాటరీ టికెట్ కాదు.. ఓ సామాన్యుడు ఈజీగా కోటీశ్వరుడిగా మారొచ్చు..
Money

Updated on: Feb 14, 2026 | 8:17 PM

ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చిన కొన్ని పెన్నీ స్టాక్స్ గురించి ఇప్పుడు చూసేద్దాం. 2001-2002 సంవత్సరాల్లో కేవలం సింగిల్ డిజిట్‌లో ఉన్న కొన్ని స్టాక్స్.. లక్ష రూపాయల పెట్టుబడిని ఇప్పుడు ఏకంగా కోట్లలో రాబడిని అందించాయి. టైటాన్ ఇండస్ట్రీస్ 2001లో రూ. 1.43గా ఉంది. అదే సమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 1.92గా, Eicher మోటార్స్ రూ. 1.97 చొప్పున ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ 2002లో రూ. 2.97 దగ్గర ట్రేడ్ అయ్యేది. ఈ స్టాక్స్‌లో ఆ సమయంలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, టైటాన్‌లో రూ. 14.76 కోట్లు, ఐషర్ మోటార్స్‌లో రూ. 13.63 కోట్లు, బజాజ్ ఫైనాన్స్‌లో రూ. 19.61 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో రూ. 9.93 కోట్లుగా మీ పెట్టుబడి మారేది.

అయితే, అన్ని పెన్నీ స్టాక్స్ ఇలాంటి సంపాదనను సృష్టించవు. ఈ స్టాక్స్ అద్భుతమైన రాబడిని ఇవ్వడానికి ప్రధాన కారణాలు లేకపోలేదు. స్థిరమైన వ్యాపార వృద్ధి, సమయానుగుణంగా జరిగిన బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్. ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి కన్స్యూమర్ ఫైనాన్స్ కంపెనీగా.. ఐషర్ మోటార్స్ కమర్షియల్ వెహికల్ కంపెనీ నుంచి ప్రీమియం టూ-వీలర్ కంపెనీగా మారడం లాంటి మార్పులు గణనీయమైన మార్కెట్ క్యాప్‌ను సృష్టించాయి.

అయితే చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే భయం ఉంటుంది. కానీ ఇలాంటి అద్భుతమైన రాబడి అందించే స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే.. కచ్చితంగా మీ భవిష్యత్తుకు కావల్సినంత నిధి సమకూర్చుకున్నట్టే. అయితే స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేముందు కచ్చితంగా మీ బిజినెస్ అడ్వైజర్‌ను సంప్రదించండి.