
మనం సాధారణంగా ఇంట్లో ఉన్న బంగారం పట్టుకెళ్లి బ్యాంకులో పెడితే వెంటనే లోన్ వచ్చేస్తుందని అనుకుంటాం. కానీ ఇప్పుడు రూ. 2.2 లక్షల కంటే ఎక్కువ రుణం కావాలంటే ఆదాయపు పన్ను వివరాలు, జీఎస్టీ, ఆధార్ కార్డు వంటివి తప్పనిసరి చేశారు. అక్రమ బంగారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా లోన్-టు-వాల్యూ నిష్పత్తిలో కూడా స్లాబులు వచ్చాయి. మీరు తక్కువ లోన్ తీసుకుంటే ఎక్కువ శాతం (85 శాతం) డబ్బు వస్తుంది, కానీ లోన్ మొత్తం పెరిగే కొద్దీ ఈ శాతం 75 శాతానికి తగ్గిపోతుంది. అంటే ఎక్కువ లోన్ కావాలంటే ఎక్కువ బంగారం తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే, జాతీయ బ్యాంకుల్లో 7.5 శాతం నుంచే ప్రారంభం అవుతుండగా, ప్రైవేట్ సంస్థల్లో ఇది 24 శాతం వరకు వెళ్లవచ్చు. కాబట్టి లోన్ తీసుకునే ముందే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు సరిచూసుకోవాలి.
బ్యాంకులు, NBFCల మధ్య వడ్డీ రేట్లలో భారీ వ్యత్యాసం ఉంటుంది(7.5 శాతం నుంచి 24 శాతం వరకు). సాధ్యమైనంత వరకు జాతీయ బ్యాంకులను ఎంచుకోవడం వల్ల తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది.
ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే, బ్యాంకులు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే మీ బంగారాన్ని వేలం వేసే హక్కును కలిగి ఉంటాయి. కాబట్టి గడువు లోపు చెల్లింపులు పూర్తి చేయాలి.
మార్కెట్లో బంగారం ధర తగ్గితే, బ్యాంకులు అదనపు సెక్యూరిటీని అడగవచ్చు. మీ ఫోన్కి వచ్చే వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ నోటీసులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
ప్రాసెసింగ్ ఫీజు, వాల్యుయేషన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు అదనపు వసూళ్లు చేస్తాయి. లోన్ తీసుకునే ముందే వీటన్నింటిపై స్పష్టత తీసుకోవాలి.
లోన్ తీరిన తర్వాత మీ నగలను తిరిగి తీసుకునేటప్పుడు.. మీరు పెట్టిన క్యారెట్ల బంగారం(ఉదాహరణకు 22ct లేదా 24ct) అంతే ఉందా? లేదా ఏవైనా మార్పులు జరిగాయా? అని క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి.
Also Read: EMI లేకుండా 5 ఏళ్లు ఇలా చేస్తే రూ. 50 లక్షల ఇల్లు మీ సొంతం.. చాలామందికి ఇది తెలియక తన్నుకుంటున్నారు