మత్స్యకారులకు గమనిక.. ఈ కార్డుని ఉపయోగిస్తున్నారా..! వివరాలు తెలుసుకోండి..
Fishermen:మత్స్య కార్మికుల అవసరాలు తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ఉపయోగపడుతుందని పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని
Fishermen:మత్స్య కార్మికుల అవసరాలు తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ఉపయోగపడుతుందని పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫిషరీస్ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్తం కేసీసీ కార్డుని వారికి వర్తింపజేసిందన్నారు. దీనిపై అవగాహన కల్సించడానికి ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వెబ్నార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మత్స్యశాఖ (DoF) కార్యదర్శి జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షత వహించగా 400 మందికి పైగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వైన్ మత్స్య రంగం నేపథ్యం, వైవిధ్యాన్ని గురించి తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు మత్స్యకార్మికులకు ఒక వరంలాంటిదని వారి క్యాపిటల్ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్మికులందరికి సులువుగా రుణాలు అందించడమే ఈ కార్డ్ లక్ష్యమని చెప్పారు. అర్హులైన మత్స్యకారులు ఈ కార్డుని ఉపయోగిస్తున్నారా లేదా అనేది రాష్ట్ర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను కోరారు. అలాగే ఏదైనా అడ్డంకి ఉన్నట్లయితే వాటిని తొలగించడానికి సంబంధిత బ్యాంకులను సంప్రదించి KCC ఆమోదం లభించేలా చూడాలన్నారు.
ఈ ప్రచారాన్ని 15 నవంబర్ 2021 నుంచి 15 ఫిబ్రవరి 2022 వరకు నిర్వహిస్తున్నట్లు స్వైన్ తెలిపారు. జాయింట్ సెక్రటరీ (ఇన్ ల్యాండ్ ఫిషరీస్) సాగర్ మెహ్రా మాట్లాడుతూ.. భారతదేశంలో ఆక్వాకల్చర్, మత్స్య సంపదను ప్రోత్సహించడానికి, విస్తరించడానికి డిపార్ట్మెంట్ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. చేపల పెంపకందారులు, మత్స్యకారుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికే KCC సౌకర్యాన్ని విస్తరించామని తెలిపారు. అనంతరం కేసీసీ కార్డుపై ఉన్న సందేహాల గురించి కార్మికులకు వివరించే ప్రయత్నం చేశారు.