
Gold Rate Today: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు, ఆగస్టు 27 గురువారం భారీగానే కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు వెళ్లి ప్రస్తుతం రూ.1.63,740 వరకు వెళ్లింది. ఈ వ్యత్యాసాన్ని చూస్తే ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో అర్థమైపోతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, డాలర్ బలపడటం, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1.4 శాతం తగ్గి ఔన్స్కు 4,592 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గతంలో ఇదే ధర 4,650 డాలర్లకు పైగా నమోదైంది. మంగళవారం బంగారం ధర మే 14 తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. దీంతో ఇటీవలి ర్యాలీలో వచ్చిన లాభాలను అందుకోవడానికి కొంతమంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ప్రాఫిట్ బుకింగ్ కూడా పసిడి ధరల తగ్గుదలకు కారణమవుతోంది.
అమెరికా మార్కెట్లను పరిశీలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.9 శాతం తగ్గి 4,653 డాలర్ల వద్ద ముగిసింది. మరోవైపు అమెరికా డాలర్ విలువ 0.3 శాతం బలపడింది. సాధారణంగా డాలర్ బలపడితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై ఒత్తిడి పెరుగుతుంది. డాలర్తో కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు పసిడి ఖరీదుగా మారడంతో డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. గమనిక: బంగారం, వెండి ధరలు నగరం, జువెల్లరీ, పన్నులు, మేకింగ్ ఛార్జీలను బట్టి మారవచ్చు.
ఇది కూడా చదవండి: BSNL Offer: బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్.. చౌకైన రీఛార్జ్తో 412 రోజుల వ్యాలిడిటీ..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి