
ముందుగా మనం ఈ ఐదేళ్లలో బంగారం రేటు ఎలా పెరుగుతూ వచ్చిందో తెలుసుకుందాం పదండి… దిగువన ఇచ్చినవి యావరేజ్ రేట్లు….
ఈ ఐదేళ్లలో బంగారం వెండి ధరలు పెరుగుదల శాతం చూస్తే.. 2020లో రూ48వేల 651 ఉన్న బంగారం ధర, 2025కు వచ్చేసరికి 1లక్షా 4వేల424 రూపాయలకు పెరిగింది అంటే పెరుగుదల శాతం 114.6. ఇక వెండి చూస్తే 2020లో 63,435 ఉన్న వెండి 2025 నాటికి లక్షా 17వేలకు చేరింది. అంటే 84.5శాతం పెరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వెండి బంగారం కంటే అత్యధిక హైక్ను నమోదు చేసింది. ఈ ఒక్క సంవత్సరలోనే వెండి పెరుగుదలశాతం 42.
ఈ రేంజ్లో గోల్డ్ , సిల్వర్ పెరగడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి గోల్డ్ను కొనేందుకు ప్రజలు ఆసక్తి పెంచుకోవడం, ఒకటైతే కేంద్ర బ్యాంకులు రిజర్వ్ నిల్వలను పెంచుకోవడం మరో కారణం. అలాగే దిపావళి, దంతేరాస్ లాంటి పండుగలు రావడంతోనూ బంగారం ధరలు పెరిగాయి. ఇక అమెరికా సుంకాల మోత కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా ఉంది. ఎందుకంటే భారత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడ్డ దేశం. దీంతో మన రూపాయి క్షీణించి డాలర్ విలువ పెరగడంతో గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. ఒకసారి మనం ఏ ఏసెక్టార్లో బంగారం, వెండి ధరలకు డిమాండ్ ఉందో ఇప్పుడు గ్రాఫికల్గా చూద్దాం.
భవిష్యత్ పరంగా గోల్డ్ సిల్వర్, ఇన్వెస్ట్మెంట్లలో ఏది బెటరో చూస్తే.. స్టేబుల్ ఇన్వెస్టర్లకు బెటర్ ఆప్షన్ గోల్డ్ అంటున్నారు నిపుణులు.
రిస్క్ టేకర్లకు సిల్వరే బెటర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఎక్కువగా ఉండడంతో భవిష్యత్లో సిల్వర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫ్లియేషన్ టైమ్లో అంటే ఆర్ధిక అనిశ్చిత్తిలోమాత్రం బంగారం వైపు మొగ్గుచూపాలని నిపుణులు సూచిస్తున్నారు.
హై రిటర్న్స్ కావాలంటే తక్కువ టైమ్లో సిల్వర్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే రాబోయే రెండేళ్లలో కిలో వెండి 3లక్షలకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. లాంగ్-టర్మ్ సేఫ్టీకి బంగారమే బెస్ట్ ఆప్షన్గా చూస్తోంది మార్కెట్. షార్ట్-టర్మ్ గెయిన్స్కు మాత్రం సిల్వర్ బెటర్ అంటున్నారు నిపుణులు.