
ఈపీఎఫ్ స్కీమ్ ద్వారా ఉద్యోగులు ఆర్తిక భద్రతను పొందుతున్నారు. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ప్రాథమిక జీతంలో 12 శాతం ఉద్యోగి జీతం నుంచి తీసివేయబడుతుంది. అలాగే ఉద్యోగి పూర్తి సహకారం ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుండగా, ఉద్యోగి సహకారంలో 3.67 శాతం అదే కార్పస్కు వెళ్తుంది. అయితే 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అని పిలిచే పెన్షన్ ఖాతాలోకి వెళ్తుంది. అయితే సగటు ఉద్యోగికి ఈపీఎఫ్ పీఎఫ్ బ్యాలెన్స్ ఏమిటో కష్టంగా ఉంటుంది.అయితే చిన్న మిస్డ్ కాల్ ద్వారా ఈపీఎఫ్ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో మిస్డ్ కాల్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవచ్చో? చూద్దాం.
ఒక ఉద్యోగి అంటే ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్ 9966044425 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ సమాచారం తెలుసుకోవచ్చు. ఈ నెంబర్కు కాల్ చేస్తే ఆటోమెటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది. అయితే మీరు ఈపీఎఫ్ఓ రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తేనే పీఎఫ్ సమాచారం వస్తుంది. ఈ సేవకు అర్హత పొందే ముందు మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) మీ ఆధార్ లేదా పాన్ లేదా బ్యాంక్ ఖాతాకు లింక్ అయ్యిందని నిర్ధారించుకోవాలి. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు ఎస్ఎంఎస్ ద్వారా సేవను కూడా ఉపయోగించవచ్చు. ఈ ఎస్ఎంఎస్ను వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 కు పంపాలి. ఈ సేవలను ఇంగ్లిష్, హిందీతో పాటు స్థానిక భాషలైన బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.