
గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో క్రెడిట్ కార్డ్ మోసాలు కూడా పెరిగాయి. మన స్మార్ట్ఫోన్లలో OTP, CCV నంబర్లు లేదా క్రెడిట్ కార్డ్ల ఫోటోలను షేర్ చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ల ద్వారా ఇతరులతో క్రెడిట్ కార్డ్లను షేర్ చేయడం వల్ల వారు హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో మోసాల నుండి సురక్షితంగా క్రెడిట్ కార్డ్లను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 2024లోనే సైబర్ నేరగాళ్ల వల్ల ప్రజలు రూ.22,845 కోట్లు కోల్పోయారు. ఇది 2023లో నమోదైన రూ.7,465 కోట్ల కంటే ఎంతో ఎక్కువ. 2024లోనే 36 లక్షల ఆర్థిక మోసం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఎక్కువగా ఫోన్ ద్వారానే జరిగాయి. మోసగాళ్లు క్రెడిట్ కార్డ్ వివరాలను అడిగి ఆర్థిక నష్టాలను కలిగించడం ద్వారా వినియోగదారుల గుర్తింపులను దొంగిలించారు.
మోసగాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ వంటి అధికారిక సంస్థల పేరుతో ఫోన్ చేసి వినియోగదారులను నమ్మిస్తారు. వారు వినియోగదారుల నుండి OTP, CVV, కార్డు ముందు చిత్రం, పిన్ మొదలైన వాటిని అడిగి వాటిని ఉపయోగిస్తారు. తప్పుడు సమాచారాన్ని పంచుకోవడం వల్ల కొన్నిసార్లు కార్డు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. దీని కారణంగా, బాధితులు మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టం వంటి దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి