మీ PF అకౌంట్‌లో వడ్డీ డబ్బులు జమ అ‍య్యాయా? ఇలా చెక్ చేసుకోండి!

EPF ఖాతాదారులు ఇప్పుడు తమ వడ్డీ జమ వివరాలను ఇంట్లోనే సులభంగా తెలుసుకోవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. UAN, పాస్‌వర్డ్‌తో EPFO పోర్టల్ లేదా UMANG యాప్ ద్వారా మీ EPF పాస్‌బుక్‌ను తనిఖీ చేసి, వడ్డీని ధృవీకరించుకోవచ్చు.

మీ PF అకౌంట్‌లో వడ్డీ డబ్బులు జమ అ‍య్యాయా? ఇలా చెక్ చేసుకోండి!
Epf Interest Check

Updated on: May 20, 2026 | 7:06 AM

EPFO సభ్యులు ఇప్పుడు తమ EPF ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో ఇంట్లో నుంచే సులభంగా తెలుసుకోవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత EPFO ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో వార్షిక వడ్డీని జమ చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.25 శాతం వార్షిక వడ్డీ రేటును ప్రభుత్వం కొనసాగిస్తోంది. అయితే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) భాగంపై మాత్రం ఎలాంటి వడ్డీ ఇవ్వబడదు. సాధారణంగా మార్చి నెల కాంట్రిబ్యూషన్ ఎంట్రీలు అప్‌డేట్ అయిన తర్వాత వడ్డీ మొత్తం సభ్యుల ఖాతాల్లో కనిపిస్తుంది. సభ్యులు తమ EPF పాస్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో లేదా ఉమాంగ్ యాప్ ద్వారా పరిశీలించి వడ్డీ జమను ధృవీకరించుకోవచ్చు.

EPF నిబంధనల ప్రకారం ఉద్యోగి తన ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతం మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తారు. యజమాని కూడా 12 శాతం చెల్లిస్తాడు. ఇందులో 3.67 శాతం EPF ఖాతాలోకి, 8.33 శాతం EPS ఖాతాలోకి వెళ్తుంది. ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ముందుగా అధికారిక EPFO పాస్‌బుక్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. సభ్యుని ID ఎంచుకున్న తర్వాత EPF పాస్‌బుక్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంట్రెస్ట్‌ అప్డేటెడ్‌ లేదా వడ్డీకి సంబంధించిన ఎంట్రీ కనిపిస్తే, వడ్డీ జమ అయినట్లే.

ఇక UMANG యాప్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాప్‌లో ప్రభుత్వ సేవలు విభాగంలో EPFO ఎంపిక చేసి, “Employee Centric Services”లో “View Passbook”పై క్లిక్ చేయాలి. అనంతరం UAN నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అయితే తాజా బ్యాలెన్స్, వడ్డీ వివరాలు కనిపిస్తాయి. ఈ సేవ కోసం మొబైల్ నంబర్ UANతో లింక్ అయి ఉండాలి. EPF, EPS రెండూ ఉద్యోగుల భవిష్య నిధి, ఇతర నిబంధనల చట్టం, 1952 కింద అమలులో ఉన్నాయి. EPF ఉద్యోగుల దీర్ఘకాలిక పొదుపు కోసం రూపొందించబడిన పథకం కాగా, EPS పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ అందించే పథకం. ఉద్యోగులు EPSకి నేరుగా డబ్బు చెల్లించరు. యజమాని వాటాలోని కొంత భాగం మాత్రమే EPS ఖాతాకు బదిలీ అవుతుంది. 58 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత EPS కింద పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగి మరణించిన సందర్భంలో అర్హులైన కుటుంబ సభ్యులకు కూడా పెన్షన్ సదుపాయం లభిస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us