
బంగారం ధరలు మన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ గత రెండు రోజుల్లో అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.
నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 61,040 కాగా ఈరోజు కూడా రూ. 61,040 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 55,950 ఉండగా ఈరోజు కూడా వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. రూ.55,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్నమన్నటి వరకూ 76వేల వద్ద ఉన్న ఉన్న ధరలు.. ఏకంగా 78వేల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్..రూ. 61,040
విజయవాడ..రూ. 61,040
ముంబాయి..రూ. 61,040
బెంగళూరు..రూ.61,040
చెన్నై..రూ. 61,470
హైదరాబాద్..రూ. 55,950
విజయవాడ..రూ. 55,950
ముంబాయి..రూ. 55,950
బెంగళూరు..రూ. 55,950
చెన్నై..రూ.56,350
హైదరాబాద్..రూ. 78,000
విజయవాడ..రూ. 78,000
చెన్నై..రూ.78,000
ముంబాయి..రూ. 75,000
బెంగళూరు..రూ. 74,500
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..