Budget 2021 : ఆ కార్ల తయారీ సంస్థలకు పన్ను మినహాయింపులు ఉంటాయా ? బడ్జెట్‏లో ప్రవేశపెట్టే అంశాలెంటీ!

|

Jan 22, 2021 | 6:27 PM

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‏లో కొన్ని కీలక అంశాలను చేర్చనున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోని ప్రముఖ లగ్జరీ కార్ల

Budget 2021 : ఆ కార్ల తయారీ సంస్థలకు పన్ను మినహాయింపులు ఉంటాయా ? బడ్జెట్‏లో ప్రవేశపెట్టే అంశాలెంటీ!
Follow us on

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‏లో కొన్ని కీలక అంశాలను చేర్చనున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు లంబోర్ఘిని సంస్థలకు పన్ను మినహాయింపులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక పన్నుల కారణంగా ప్రీమియం కార్ల మార్కెట్లో వీటి అమ్మకాలు పెరగడం లేదని సదరు కంపెనీ అధికారులు వాపోతున్నారు. ఇక కరోనా వైరస్ ప్రభావం కార్ల తయారీపై భారీగానే పడింది. దీంతో ఈ కార్లపై పన్ను శాతం అధికంగా ఉంటే.. వీటి అమ్మకాల డిమాండ్ పై పన్ను శాతం ప్రభావం చూపిస్తుందని, తద్వారా గతేడాదిలో నెలకొన్న పరిస్థితులను ఈ రంగం అధిగమించలేదని ఆ కంపెనీలు పేర్కోంటున్నాయి.

ఇదే విషయమై.. మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ.. “ఈ మార్కెట్ పరంగా ఉన్న డిమాండ్‏ను మేము నివారించగలిగేలా ఉండాలి.  మార్కెట్లో ఉన్న డిమాండ్  పరంగా ఇది కార్ల విక్రయాలను మరింత దెబ్బతీస్తుంది. కేంద్రం ప్రవేశపెట్టె బడ్జెట్‏లో పన్ను మినహాయింపు కలిగిస్తుందని” ఆశభావం వ్యక్తం చేశారు.

లగ్జరీ కార్లపై 22 శాతం వరకు పన్ను మినహాయింపు ?..
ఇప్పటికే కార్ల అమ్మకాలపై పన్ను రేటు అధికంగా ఉందని.. వీటిపై పన్ను తగ్గింపు చేయాలని కోరుకుంటున్నట్లు ష్వెంక్ తెలిపారు. అలాగే దిగుమతి సుంకం నుంచి వస్తు సేవల పన్ను (GST) లగ్జరీ కార్లపై 22 శాతం ఉంది. ఇక ఈ మార్కెట్ అభివృద్ధి కోసం పన్ను తగ్గించడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే ఇందుకోసం సరైన మార్గాన్ని ఎంచుకుంటాం అని చెప్పారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే ఈ కార్ల మార్కెట్ కోలుకుంటుందని ఆడి ఇండియా చీఫ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రాబోయే కాలంలో ఈ మార్కెట్ చాలా సవాళ్ళను ఎదుర్కోనుందని.. అంతేకాకుండా ఈ లగ్జరీ కార్లపై ఎక్కువగా పన్ను విధించడం అంటే ఒక పెద్ద సవాలును స్వీకరించడం లాంటిందని ఆయన తెలిపారు. దీంతో మొత్తం వాహనాల మార్కెట్లో ఈ లగ్జరీ కార్లు విక్రయాలు కేవలం ఒక శాతం ఉందని.. 2020లో ఈ మార్కెట్ విలువ 0.7 నుంచి 0.8 శాతానికి తగ్గిందని.. ఇక శాతాన్ని పెంచడం తమ ముందు ఉన్న పెద్ద సవాలు అని పేర్కోన్నారు.

ఇక ఈ లగ్జరీ కార్ల విభాగాన్ని ప్రభుత్వంతో కొనసాగింపును ఇంకా కొనసాగించాలనుకుంటున్నట్లు ప్రముఖ లంబోర్ఘిని ఇండియా అధినేత శంబర్ అగర్వాల్ అన్నారు. లగ్జరీ కార్ల మార్కెట్ 2020లో చాలా నష్టపోయిందని.. ఇక ఈ ఏడాది దీని విలువను 2019లో ఉన్న స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అభివృద్ది కాకుండా.. 2019లో మార్కెట్ ఉన్న స్థాయిని తిరిగి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో లగ్జరీ కార్లపై పన్ను శాతం పెరిగితే.. ఈ కార్ల మార్కెట్‏పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Also Read: