మన పిల్లలు తెల్ల జాత్యహంకారానికి బలయ్యారు. ఒక ఫేక్ యూనివర్సిటీ మాయలో 170 మంది తెలుగు పిల్లలు చిక్కుకున్నారు. మరో రెండు నకిలీ యూనివర్సిటీలు పుట్టుకొచ్చాయి. ఈ రాజకీయాల్లో మన తెలుగు విద్యార్థులు బలైపోతున్నారు. ఇప్పటికే ఒక ఫేక్ యూనివర్సిటీ పెట్టి తెలుగు పిల్లల్ని ఎఫ్.బీ.ఐ అధికారులు జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు అమెరికా మరో రెండు ఫేక్ యూనివర్సిటీలను పెట్టి మన తెలుగు పిల్లలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఫేక్ కాదు… సర్టిఫికెట్లు ఫేక్ కాదు.. యూనివర్సిటీలే ఫేక్. ఈ విధంగా తెలుగు పిల్లలని అష్ట కష్టాలపాలు చేస్తుంది అమెరికా. ఇలాంటి మరెన్నో అంశాల గురించి టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ గారి విశ్లేషణ చూడండి.