విజయవాడ: మంగళవారం లగడపాటి రాజగోపాల్, కోడెల శివప్రసాద్ భేటీ అయ్యారు. గుంటూరు చుట్టగుంటలోని ఓ హోండా షోరూంలో వీరిద్దరూ చాలా సమయంపాటు చర్చలు జరిపారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేయగల సమర్ధుడని రాజగోపాల్కు పేరుండటంతో ఆయనతో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏదైనా ఎన్నికల సర్వే చేయిస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే మొత్తం పార్టీపరమైన సర్వేన లేక తన నియోజకవర్గం వరకు మాత్రమే ఆ సర్వే పరిమితమా అనేది సస్పెన్స్గా ఉంది.