నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర్ రావు ఇళ్లపై దాడి చేశారు ఏసీబీ అధికారులు. డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, మధురవాడ, బొబ్బిలి, పలాస, టెక్కలి, భీమిలిలో సోదాలు నిర్వహించారు. 20 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్లు బయటపడింది. బినామీ పేర్లమీద భూములు, ఇళ్లను కొనుగోలు చేసినట్లు సోదాల్లో బయటపడ్డ డాక్యుమెంట్లను పరిశీలిస్తే తేలిందన్నారు డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్. 20 కోట్ల అక్రమాస్తులను కూడ బెట్టిన శంకర్ రావును అరెస్ట్ చేశారు. స్వాధనం చేసుకున్న డ్యాకుమెంట్లు, బంగారం విలువను లెక్కగడితే.. అక్రమాస్తుల విలువ మరింత పెరుగుతుందన్నారు.