రాజస్థాన్ లో 127కి చేరిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య

|

Feb 19, 2019 | 12:34 PM

జైపూర్ : రాజస్థాన్ లో స్వైన్ ఫ్లూ వీరవిహారం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ఏడాది స్వైన్ ఫ్లూతో మృతిచెందిన వారి సంఖ్య 127కి చేరింది. తాజాగా మరో యాభై ఆరు కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో జైపూర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 18 మంది వ్యాధితో ఆస్పత్రుల్లో చేరారు. తరువాతి స్థానంలో ఉన్న ఉదయ్ పూర్లో తొమ్మిదిమందికి స్వైన్ ఫ్లూ సోకింది. కోటాలో ఆరు, హనుమాన్ ఘర్ లో అయిదు కేసులు నమోదయ్యాయి. ఇంకా […]

రాజస్థాన్ లో 127కి చేరిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య
Follow us on

జైపూర్ : రాజస్థాన్ లో స్వైన్ ఫ్లూ వీరవిహారం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ఏడాది స్వైన్ ఫ్లూతో మృతిచెందిన వారి సంఖ్య 127కి చేరింది. తాజాగా మరో యాభై ఆరు కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో జైపూర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 18 మంది వ్యాధితో ఆస్పత్రుల్లో చేరారు. తరువాతి స్థానంలో ఉన్న ఉదయ్ పూర్లో తొమ్మిదిమందికి స్వైన్ ఫ్లూ సోకింది. కోటాలో ఆరు, హనుమాన్ ఘర్ లో అయిదు కేసులు నమోదయ్యాయి. ఇంకా పలు ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 3,564 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.