
గ్రహాలకు అధిపతి సూర్యుడు మార్చి 14న మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఆ రాశిలో, శుక్రుడు ఉణ్నాడు. దీంతో రెండు గ్రహాల కలియక జరగబోతుంది. దీని ప్రభావం 12 రాశులపై పడగా, మూడు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వచ్చి, ధనయోగం కలగనుంది.

అంతేకాకుండా ఈ రెండు గ్రహాల కలయిక వలన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కాగా, దీని ప్రభావం మూడు రాశులపై ఎలా ఉంటుందో చూద్దాం. ఆ రాశులు ఏవి అంటే?

వృషభ రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం వలన అద్భుతంగా ఉండబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. దూరపు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ధనలాభం కలుగుతుంది. చేతినిండా డబ్బే ఉండటం వలన ఎలాంటి సమస్యలు దరి చేరవు.

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించడం వలన మిథున రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఊహించని విధంగా వీరి అదృష్టం పడుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఆర్థికసమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా గడుపుతారు.

తులరాశి వారికి శుక్రాదిత్య రాజయోగం వలన చాలా లాభాలు ఉన్నాయి. వీరి అవసరానికి డబ్బు చేతికందుతుంది. కోర్టు సమస్యలు అనుకూలంగా వస్తాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.