Artificial intelligence: ఆ పరికరం కరోనావైరస్‌ను క్షణాల్లో కనిపెడుతుందట…

కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. ఎవరైనా దగ్గినా తుమ్మినా జనాలు భయపడిపోతున్నారు. కరోనా లక్షణాలనే అనుమానంతో ఆస్పత్రుల్లో

Artificial intelligence: ఆ పరికరం కరోనావైరస్‌ను క్షణాల్లో కనిపెడుతుందట...
Follow us

| Edited By:

Updated on: Mar 03, 2020 | 10:38 PM

Artificial intelligence (AI): కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. ఎవరైనా దగ్గినా తుమ్మినా జనాలు భయపడిపోతున్నారు. కరోనా లక్షణాలనే అనుమానంతో ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. కానీ వీరికి నిజంగా కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. అయితే ఇకపై అలాంటి అవసరం లేదంటూ ఓ వార్త వినపడుతోంది. ఎందుకంటే, చైనాకు చెందిన ఆలీబాబా సంస్థ సిద్ధం చేసిన ఏఐ(అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కరోనా వైరస్‌ను ఇట్టే పట్టేస్తుందట.

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఆధ్వర్యంలోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డామో అకాడమీలో ఈ ఏఐను అభివృద్ధి చేశారని తెలుస్తోంది. కంప్యూటరైజిడ్ టోమోగ్రఫీ స్కాన్స్(సీటీ స్కాన్స్) ద్వారా ఇది కరోనాను గుర్తిస్తుందట. అది కూడా అత్యంత వేగంగా 20 సెకన్లలోనే పేషెంట్ పరీక్ష పూర్తవుతుందని సమాచారం. ఈ పరీక్షా ఫలితాలు 96శాతం కచ్చితత్వంతో ఉంటాయని అంటున్నారు. దాదాపు 5వేలమంది కరోనా బాధితుల డేటాతో ఈ ఏఐ మోడల్‌కు శిక్షణ ఇచ్చినట్లు పరిశోధకులు చెప్పారట.

మరోవైపు, చైనాకే చెందిన హెల్త్‌కేర్ కంపెనీ పింగ్ ఆన్.. కూడా కరోనాను కనిపెట్టే ఓ పరికరాన్ని తయారు చేసిందట. దీని గురించి ఆ సంస్థ సహాధ్యక్షుడు మాట్లాడుతూ.. తమ పరికరం 15 సెకన్లలోనే కరోనా కేసులను పట్టేస్తుందని, ఫలితాలు 90శాతం కచ్చితత్వంతో ఉంటాయని ప్రకటించారు.