పవన్-రవితేజ మల్టీస్టారర్.. స్క్రిప్ట్ రెడీ చేసిన దర్శకుడు..!
టాలీవుడ్లో మల్టీస్టారర్లకు క్రేజ్ పెరుగుతోంది. ఓ వైపు మల్టీస్టారర్లో నటించేందుకు హీరోలు రెడీ అవుతుండటంతో.. అలాంటి కథలు రాసేందుకు దర్శకులు కూడా రెడీ అయ్యారు. ఈ క్రమంలో టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్కు సంబంధించిన ఓ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. పవర్స్టార్ పవన్ కల్యాణ్, మాస్ మహారాజా రవితేజ ఇద్దరి కోసం ఓ దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేశారట. ఈ ఇద్దరినీ ఎలాగైనా ఒప్పించి.. ఈ మల్టీస్టారర్ను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని ఆయన అనుకుంటున్నారట. ఇంతకు […]
టాలీవుడ్లో మల్టీస్టారర్లకు క్రేజ్ పెరుగుతోంది. ఓ వైపు మల్టీస్టారర్లో నటించేందుకు హీరోలు రెడీ అవుతుండటంతో.. అలాంటి కథలు రాసేందుకు దర్శకులు కూడా రెడీ అయ్యారు. ఈ క్రమంలో టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్కు సంబంధించిన ఓ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. పవర్స్టార్ పవన్ కల్యాణ్, మాస్ మహారాజా రవితేజ ఇద్దరి కోసం ఓ దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేశారట. ఈ ఇద్దరినీ ఎలాగైనా ఒప్పించి.. ఈ మల్టీస్టారర్ను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని ఆయన అనుకుంటున్నారట. ఇంతకు ఆ దర్శకుడెవరంటే.. డాలీ.
పవన్ కల్యాణ్తో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను తెరకెక్కించిన డాలీ.. దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈ దర్శకుడు ఓ మల్టీస్టారర్ కథను రెడీ చేసుకున్నారట. ఈ కథను పవన్- రవితేజ కోసం ఆయన రాసుకున్నారట. ఈ సినిమాకు సంబంధించి ఆ ఇద్దరి హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒప్పుకుంటే.. టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్ రావడం ఖాయం. కాగా ప్రస్తుతం పవన్ మూడు సినిమాలను ఒప్పుకోగా.. మరోవైపు రవితేజ క్రాక్లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
Read This Story Also: ‘ఆచార్య’ను మహేష్ వదులుకున్నాడా..? క్లారిటీ ఇచ్చిన చిరు..!