Andhra Pradesh: వాహనం ఆగిందని సాయం చేద్దామనుకున్న పోలీసులు.. దగ్గరకు వెళ్లి చెక్ చేయగా షాక్..

|

Mar 25, 2022 | 3:53 PM

శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ ఎర్ర చందనాన్ని అక్రమార్కులు ప్రాణాలకు తెగించి స్మగ్లింగ్ చేస్తున్నారు.

Andhra Pradesh: వాహనం ఆగిందని సాయం చేద్దామనుకున్న పోలీసులు.. దగ్గరకు వెళ్లి చెక్ చేయగా షాక్..
Representative image
Follow us on

Chittoor district: ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం.. ఏపీలోని  రాయలసీమ(Rayalaseema) ప్రాంతంలో ఉన్న శేషాచలం కొండల్లో మాత్రమే దొరుకుతుంది. శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ ఎర్ర చందనాన్ని అక్రమార్కులు ప్రాణాలకు తెగించి స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా  చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంగాధర నెల్లూరు(Gangadhara Nellore) మండలం ముష్టిపల్లి వద్ద రోడ్డుపై ఓ వాహనం ఆగి కనిపించింది. తొలుత ఏదో రిపేర్ వచ్చిందేమో అనుకున్నారు. దగ్గరకు వెళ్లాక.. అనుమానం రావడంతో చెక్ చేయగా.. లోపల ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో ఆ వాహనం నడుపుతున్న స్మగ్లర్ దొరికిపోయాడు. అతను ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మరో వాహనాన్ని చేజ్ చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ వాహనం బోల్తా పడింది. దీంతో అక్కడే  ఎర్ర చందనం దుంగలను వదిలి ఆ వాహనంలోని ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారు. అయితే పోలీసులు వారిని కూడా వెంటాడి పట్టుకున్నారు. రెండు వాహనాలను,  30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అంతరాష్ట్ర స్మగ్లర్లు అని తెలిపారు. వారిని చిత్తూరు జిల్లాకు చెందిన రాజేష్, తమిళనాడుకు చెందిన దేవస్ కుమార్, ఏకాంబరం హేమ కుమార్‌లుగా గుర్తించారు.

జపాన్, చైనా, రష్యాలలో ఎర్ర చందననాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు. ఫారెన్‌లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అందుకోసం కొందరు ప్రాణాలకు తెగిస్తున్నారు.

Also Read: RRR: బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే…?