కోవెలకుంట్ల తహసీల్దార్ ఆఫీసు గ‌దిలోనుంచి విచిత్ర శ‌బ్ధాలు.. ఓపెన్ చేసి చూడ‌గా 70 గుడ్ల‌తో పైథాన్

|

May 21, 2021 | 8:30 AM

క‌ర్నూలు జిల్లా జిల్లా కోవెలకుంట్లలో షాకింగ్ సీన్ వెలుగుచూసింది. పాత తహసీల్దార్ ఆఫీసులో కొండచిలువ గురువారం టెన్ష‌న్ రేపింది. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన....

కోవెలకుంట్ల తహసీల్దార్ ఆఫీసు గ‌దిలోనుంచి విచిత్ర శ‌బ్ధాలు.. ఓపెన్ చేసి చూడ‌గా 70 గుడ్ల‌తో పైథాన్
Big Python Kovelakuntla
Follow us on

క‌ర్నూలు జిల్లా జిల్లా కోవెలకుంట్లలో షాకింగ్ సీన్ వెలుగుచూసింది. పాత తహసీల్దార్ ఆఫీసులో కొండచిలువ గురువారం టెన్ష‌న్ రేపింది. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఈ కార్యాలయంలో ప్రస్తుతం రెవెన్యూ అధికారులు రికార్డులు స్టోర్ చేస్తున్నారు. గురువారం ఓ గదిలో నుంచి విచిత్ర‌మైన శ‌బ్ధాలు వినిపించడంతో కొందరు ఉద్యోగులు తలుపు తెరిచి చూడగా భారీ కొండచిలువ కనిపించింది. త‌లుపులు తీయ‌గానే.. అది విప‌రీత‌మైన కోపంతో వారిమీద‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించింది. అందుకు కార‌ణం అది గుడ్ల‌ను పొదుగుతుండ‌టం. దీంతో కంగారు పడిన సిబ్బంది వెంటనే తలుపు మూసేసి ఫారెస్ట్ అధికారులకు, పాములు ప‌ట్టే వ్య‌క్తుల‌కు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న‌ కోవెలకుంట్ల తహసీల్దార్, బనగానపల్లె ఫారెస్టు అధికారులు అక్కడి పరిస్థితి అంచ‌నా వేశారు. పాము పూర్తిగా గుడ్లు పెట్టే వరకు వేచిచూసి ఆ త‌ర్వాత స్నేక్ క్యాచ‌ర్ ఉచ్చు వేశాడు.  అనుకున్నట్టుగానే కొండచిలువ ఉచ్చులో చిక్కింది. దాన్ని గోనెసంచిలో బంధించారు. ఆ గదిలో కొండచిలువ సుమారు 70 గుడ్లను పొదిగి ఉండటాన్ని స్టాఫ్ గుర్తించి.. షాక్ తిన్నారు. పాములు పట్టే వ్యక్తి కొండచిలువను, గుడ్లను వెలికితీశాడు. బనగానపల్లి అటవీ శాఖ అధికారులు కొండచిలువను, గుడ్లను తీసుకెళ్లారు. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

Also Read: టెన్ష‌న్… టెన్ష‌న్.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు తీర్పు వెలువ‌రించ‌నున్న హైకోర్టు

కరోనాతో మృతిచెందిన కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కుటుంబానికి మెగాస్టార్ ఆర్ధిక సాయం..