కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎంవీ ధర్మారెడ్డిని డిప్యూటేషన్పై ఏపీకి పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ హయాంలో టీటీడీ జేఈవో, తిరుమల స్పెషల్ ఆఫీసర్గా ధర్మారెడ్డి పని చేశారు. మళ్లీ ధర్మారెడ్డికి టీటీడీలో పనిచేసే అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రహోంశాఖలో కీలకమైన హోంశాఖ జాయింట్ సెక్రటరీ హోదాలో ధర్మారెడ్డి పనిచేస్తోన్నారు. ఏపీ ప్రభుత్వ కోరిక మేరకు ధర్మారెడ్డిని డిప్యూటేషన్పై కేంద్రం పంపింది.