తెలుగుజాతిని ఉద్దేశిస్తూ, ఆశీర్వదిస్తూ దివంగత నేత ఎన్టీఆర్ AI ప్రసంగం..!
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా మహానాడు వేదికగా నివాళి అర్పించారు చంద్రబాబు. ఎన్టీఆర్ జన్మదినం తెలుగు ప్రజలకు పండుగ రోజు అన్నారు. ఇక తెలుగుజాతిని ఉద్దేశిస్తూ,ఆశీర్వదిస్తూ మాట్లాడిన AI ఎన్టీఆర్ ప్రసంగం మహానాడులో హైలైట్గా నిలిచింది.
తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కడపలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102వ జయంతిని పురస్కరించుకుని, మహానాడు వేదికగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జన్మదినం తెలుగు ప్రజలకు పండుగ రోజు అన్నారు. ఇక తెలుగుజాతిని ఉద్దేశిస్తూ, ఆశీర్వదిస్తూ మాట్లాడిన AI ఎన్టీఆర్ ప్రసంగం మహానాడులో విశేషంగా ఆకట్టుకుంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన పథకాలు, సాధించిన అభివృద్ధి గురించి ఏఐ ఎన్టీఆర్ ప్రస్తావించారు. తాను ప్రారంభించిన పథకాలను గుర్తుచేస్తూ, చంద్రబాబు నాయకత్వంలో రూపుదిద్దుకున్న ప్రస్తుత సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. ఈ ఏఐ ప్రసంగం మహానాడుకు హాజరైన ప్రతినిధులు, కార్యకర్తలను ఎంతగానో ఉత్తేజపరిచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

