![AP Cabinet: మావోయిస్టులపై నిషేధం పొడిగింపు.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/andhra-cabinet.jpg?q=20&w=1280)
Andhra Cabinet
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి పార్థసారధి మీడియాకు వెళ్లడించారు.
- స్థానిక సంస్థలు, సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది
- రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ను రద్దు చేసి స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది
- ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ
- జగన్ ఫొటో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో.. రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
- మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ క్యాబినెట్లో తీర్మానం చేశారు
- నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
- త్వరలో రెవెన్యూ, గ్రామ సభల నిర్వహణ
- జిల్లాల్లో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశం
- రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు
- గుజరాత్ లోని పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం
- సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం
- 3 నెలలపాటు 22ఏలోని భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేత
- సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు
- గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన 217 జీవో రద్దు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..