ఇకపై బైక్‌ ఎక్కనున్న తిరుమల శ్రీవారు !

ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్నకానుకలకు కొదువే లేదు. తలనీలాలు మొదలు నిలువు దోపిడీ పేరిట భక్తులు భారీగానే విరాళాలు సమర్పించుకుంటారు. ఎవరికి తోచిన కానుకలు వారు స్వామివారికి సమర్పించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ. అలా వచ్చిన కానుకల్లో బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు..ఇలా ఒక్కటేమిటీ…అన్ని రకాల కానుకలు స్వీకరిస్తారు శ్రీవారు. తాజాగా తిరుమల వెంకన్నకు స్కూటర్‌ బహుకరించాడు ఓ భక్తుడు. బెంగళూరుకు చెందిన విటెక్‌ ఆటోమోటార్స్‌ కంపెనీ యజమాని రూ. 60 వేల […]

ఇకపై బైక్‌ ఎక్కనున్న తిరుమల శ్రీవారు !

Updated on: Aug 15, 2019 | 8:56 PM

ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్నకానుకలకు కొదువే లేదు. తలనీలాలు మొదలు నిలువు దోపిడీ పేరిట భక్తులు భారీగానే విరాళాలు సమర్పించుకుంటారు. ఎవరికి తోచిన కానుకలు వారు స్వామివారికి సమర్పించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ. అలా వచ్చిన కానుకల్లో బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు..ఇలా ఒక్కటేమిటీ…అన్ని రకాల కానుకలు స్వీకరిస్తారు శ్రీవారు. తాజాగా తిరుమల వెంకన్నకు స్కూటర్‌ బహుకరించాడు ఓ భక్తుడు. బెంగళూరుకు చెందిన విటెక్‌ ఆటోమోటార్స్‌ కంపెనీ యజమాని రూ. 60 వేల విలువగల ఈజీ మోడల్‌కు సంబంధించిన తొలి స్కై బైక్‌ స్కూటర్‌ని స్వామివారికి సమర్పించాడు. ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ని టీటీడీ రవాణా విభాగం ఆఫీస్‌ ఇంచార్జ్‌ హరిబాబు సమక్షంలో శ్రీవారి ఆలయంల డిప్యూటీ ఓ హరినాథ్‌కు అందజేశారు.
Loading...
Unable to load recommendations.
Follow Us