Andhra Pradesh: ఏపీ పాలిటిక్స్లోకి మరో ఇష్యూ.. మామూలు రచ్చ జరుగట్లేదుగా..!
Andhra Pradesh: భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించేది ఎవరు? ఏ సామాజిక వర్గం పగ్గాలు చేపట్టబోతోంది? మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్స్ దేనికి సంకేతం.
Andhra Pradesh: భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించేది ఎవరు? ఏ సామాజిక వర్గం పగ్గాలు చేపట్టబోతోంది? మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్స్ దేనికి సంకేతం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? ఒక సామాజిక వర్గానికి చెందిన వారంతా ఒక్క గూటికే చేరబోతున్నారా? ఇప్పుడు ఏపీలో వీటిపైనే డిస్కషన్ జరుగుతోంది. విశాఖ జిల్లాలో జరిగిన వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ సభలో గంటా చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఏపీ రాజకీయాలను శాసించేది కాపులే అంటూ కామెంట్ చేశారు మాజీమంత్రి గంటా. దీంతో గంటా త్వరలో పార్టీ మారబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉంటూ వస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కొంతకాలంగా ఆయన పార్టీ మారుతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. ఎన్ని ప్రచారాలు జరిగినా.. ఆయన మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకెళ్తున్నారు.
ఇదిలాఉంటే.. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా ఇదే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. భవిష్యత్ అంతా కాపులదే అన్నారాయన. అంబేద్కర్ మాదిరిగానే వంగవీటి మోహనరంగాకు పేరొచ్చిందన్నారు త్రిమూర్తులు. కాపు సామాజిక వర్గానికి చెందిన యువత బాగా చదువుకోవాలని, భవిష్యత్ అంతా కాపులదే అని పేర్కొన్నారు తోట. ఇతర సామాజికవర్గాలు వారు పోటీ చేస్తే కాపులనే గెలిపించాలని, ఇద్దరు కాపులు పోటీ చేస్తే కాపులను కాసే వారికే ఓటేయాలని పిలుపునిచ్చారు తోట త్రిమూర్తులు.
Also read: